నటీనటులు : కమల్ హాసన్, సిలంబరసన్ టిఆర్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాజర్, మహేష్ మంజ్రేకర్ మరియు ఇతరులు
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : రవి కె. చంద్రన్, సంగీత దర్శకుడు : ఎ.ఆర్. రెహమాన్, ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు : కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్, దర్శకుడు : మణిరత్నం.
కమల్ హాసన్, మణిరత్నం 35 ఏళ్ళ తర్వాత పునఃకలయికను గుర్తుచేసే థగ్ లైఫ్ చిత్రం కర్నాటకలో వివాదాల వల్ల వాయిదాకు నోచుకోకపోయినా మిగిలినచోట్ల నేడే విడుదలైంది. ట్రైలర్ లో అంతర్జాతీయ కాన్సెప్ట్ తో రూపొందినట్లుగా అనిపిస్తుంది. ఇంకోవైపు నాయకుడు చిత్రం తర్వాత ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో అని కూడా ప్రచారం జరిగింది. మరి సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్), మాణిక్యం (నాసర్) అన్నదమ్ములు. న్యూఢిల్లీలో గ్యాంగ్స్టర్లు గా ఎదుగుతారు. మాస్ ఏరియాలో మహేష్ మంజ్రేకర్ అనే మరో గ్యాంగ్ స్టర్ తో ఓ డీల్ చేసుకునే క్రమంలో పోలీసులు ఎటాక్ చేస్తారు. జనాలు చల్లాచెదురుగా వున్న టైంలో పేపర్ వేసే కుర్రాడు అమర్ (శింబు)ని అడ్డంపెట్టుకుని బయటపడతాడు శక్తిరాజ్. ఆ కుర్రాడికి చెల్లెలుంటుంది. ఆమె మిస్ అవుతుంది. ఆమెను ఎలాగైనా శోధించి అప్పగిస్తానని అమర్ కు శక్తిరాజ్ మాటఇస్తాడు. ఆ తర్వాత మాణిక్యం కూతురుని మహేష్ మంజ్రేకర్ మేనల్లుడు మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది తెలిసిన శక్తిరాజ్ అతని చంపేస్తాడు.
ఆ తర్వాత శక్తిరాజ్ కు జైలు శిక్ష పడుతుంది. జైలుకు వెళుతూ అమర్ ను తన తర్వాత గ్యాంగ్ స్టర్ గా ప్రకటిస్తాడు. ఇది సహించని మాణిక్యం, అతని బ్రుందం శక్తిరాజ్ పై అసూయ, పగతో రగిలిపోతుంటాడు. జైలులో శక్తిరాజ్ వుండగానే చాలామార్పులు అమర్ చేస్తాడు. ఇక శక్తిరాజ్ బయటకు వచ్చాక అతని హత్యచేసే ప్లాన్ చేస్తారు మాణిక్యం బ్యాచ్. అది ఎలా అమలు చేశారు. ఆ తర్వాత ఏమయింది. చిన్నతనంలో తప్పిపోయిన అమర్ సోదరి చంద్ర బతికిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
గ్యాంగ్ స్టర్ కథలన్నీ ఇంచుమించు ఒకేలా అనిపిస్తాయి. నేపథ్యాలు వేరుగా వుంటాయి. 35 ఏళ్ళ నాడు నాయకన్ సినిమా నుంచి చూసినా మమ్ముట్టి దళపతి చేసినా వర్మ మాఫియా సినిమాలు చేసినా అన్నీ పగ, ప్రతీకాలు, నమ్మినవారిని మోసం చేయడం ఖతం చేయడమే కనిపిస్తాయి. వాటిని దర్శకులు తనదైన రీతిలో ఆవిష్కరిస్తుంటారు. ఈ థగ్ లైఫ్ కూడా అలాంటిదే. మణిరత్నం, కమల్ కాంబినేషన్ సెట్ అయ్యాక ఏదో సరికొత్తగా వున్నదేమో అనిపించినా పాత తరహా కథే అనిపిస్తుంది. అయితే ఇందులో మానవీయ కోణాలుతోపాటు నమ్మక ద్రోహాలు కూడా వుంటాయి.
వయస్సులో వున్న కమల్ పాత్ర తీరు విజువల్ ట్రీట్ లా వుంటుంది. ఆ తర్వాత వయస్సు వచ్చాక చేసే పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. శింబు పాత్ర బాగానే కనెక్ట్ అవుతారు. చాలా కాలం తర్వాత శింబు సినిమా చేశాడు. యాక్షన్ సీన్స్ క్లయిమాక్స్ లో ఆకట్టుకునేలా వుంటాయి. త్రిష పాత్ర శక్తిరాజ్ కు ఉంపుడుకత్తెగా నటించింది. అశోక్ సెల్వన్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, మిగిలిన వారు వారి పాత్రల మేరకు నటించారు. 35 ఏళ్ళనాడు నాయకన్ లో మిస్ అయిన తనికెళ్ళ భరణి ఇందులో నటించేలా దర్శకుడు చేశాడు. అయితే రొటీన్ గానే వుంటుంది. అభిరామి తనకు ఇచ్చిన పరిమిత స్క్రీన్ సమయంతో బాగానే నటించింది. నాజర్ కొన్ని క్షణాల్లోనే ఆకట్టుకుంటాడు.
కమల్, మణి ఇద్దరూ స్క్రీన్ ప్లే రచయితలుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. సంబాషణల పరంగా పొదుపుగా వున్నాయి. అందరికీ బిపీ, సుగర్ వ్యాధి వున్నట్లే నాకూ అమ్మాయి వ్యవసనం అనే వ్యాధి వుందనేది చాలా పాలిష్ గా కమల్ చెప్పాడు. ఇక ఇలాంటి కథలలో న్యాయం, ధర్మం అనేవి వారి వారి ఆలోచనలను బట్టి కనిపిస్తాయి. చెప్పుడు మాటలు విని తనను పెంచిపోషించిన శక్తి రాజ్ నే చంపేయాలనుకోవడం అమర్ పాత్రలో బాగా చూపించాడు.
సాంకేతికంగా చూస్తే, మణిరత్నం తన ట్రేడ్మార్క్ శైలిని, కథ చెప్పే నైపుణ్యాన్ని తీసుకురావడంలో విఫలమయ్యాడు. కమల్తో కలిసి రాసిన స్క్రీన్ప్లే నిదానంగా రొటీన్ గా అనిపిస్తుంది. AR రెహమాన్, బలహీనమైన సౌండ్ట్రాక్ మరియు నేపథ్య స్కోర్ను అందిస్తాడు.
కొన్ని భాగాలలో కమల్ యాస కొంచెం బలవంతంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ మరొక లోపం - చిత్రానికి గట్టి కట్లు మరియు తక్కువ రన్టైమ్ అవసరం. సినిమాటోగ్రఫీ సేవ చేయదగినది, తెలుగు డబ్బింగ్ బాగానే వుంది. ఐదుగురు నిర్మాతలు కలిసి తీసిన ఈ సినిమా మరో గ్యాంగ్ స్టర్ కథ. కమల్ హాసన్, మణిరత్నం వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించడంలో, ఆశ్చర్యపరచడంలో లేదా భావోద్వేగపరంగా కదిలించడంలో విఫలమైంది. కొత్తదనం, ఊహించని మలుపులు లేని రొటీన్ సినిమాగా అనిపిస్తుంది.