కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్స్టర్ డ్రామా రేపు (జూన్ 5) థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. 'నాయకుడు' సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్, మణిరత్నం 38 ఏళ్ల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలిసి రావడం విశేషం. వీరి కాంబినేషన్లో వచ్చిన నాయకుడు ఇండియన్ సినిమా చరిత్రలో ఓ లెజెండరీ మూవీగా నిలిచిపోయింది. అదే స్థాయిలో థగ్ లైఫ్పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు చార్ట్బస్టర్ హిట్ అయ్యాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలోని శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి లాంటి స్టార్ తారాగణం కీలక పాత్రలు పోషించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. తమిళ్తో పాటు తెలుగులోను ఈ సినిమాకు సాలిడ్ బజ్ ఉంది. హీరో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు 'థగ్ లైఫ్'ని గ్రాండ్గా విడుదల చేస్తోంది. విక్రమ్, అమరన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నుంచి వస్తున్న థగ్ లైఫ్.. ఆ సంస్థకు హ్యాట్రిక్ విజయాన్ని అందిచడం ఖాయమనే అంచనాలున్నాయి.
హీరోగా ఫుల్ బిజీగా ఉన్న శింబు.. కేవలం మణిరత్నం, కమల్ హాసన్ కోసం ఈ సినిమాలో నటించారు. శింబు క్యారెక్టర్ సినిమాలో హైలెట్గా నిలుస్తుందని అంటున్నారు. అలాగే.. పొన్నియన్ సెల్వన్తో కంబ్యాక్ ఇచ్చిన త్రిష ఈ సినిమాలో నటిస్తుండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. త్రిష కెరీర్లో ఇంత వరకు పోషించని ఓ కొత్త పాత్రను ఇందులో పోషిస్తున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ థగ్ లైఫ్ను నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మణిరత్నం, రెహమాన్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు గతంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఇప్పుడు మరోసారి థగ్ లైఫ్తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఓవరాల్గా.. నాయగన్ లాగే మణిరత్నం, కమల్ కెరీర్లో 'థగ్ లైఫ్' సినిమా మరో మైలు రాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు