Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

Advertiesment
Trisha

ఠాగూర్

, శనివారం, 28 జూన్ 2025 (09:56 IST)
ప్రముఖ సినీ నటి త్రిష చెన్నైలోని మరో ఆలయానికి ఏనుగును విరాళంగా అందజేశారు. స్వతహాగా జంతు ప్రేమికురాలైన త్రిష... జంతు సంక్షేమ సంస్థ పీఎఫ్‌సీఐతో కలిసి విరాళంగా ఇచ్చారు. 
 
చెన్నైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి గజ అని పేరు పెట్టిన రోబోటిక్ ఏనుగును త్రిష కానుకగా ఇచ్చారు. గురువారం మంగళవాయిద్యాల మధ్య, వేద మంత్రోచ్ఛారణల నడుమ పీఎఫ్‌సీఐ సంస్థ నిర్వాహకులు ఈ యత్రిక ఏనుగును ఆలయ పూజారులకు శాస్త్రోక్తంగా అప్పగించారు. ఇకపై ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాల్లో ఈ రోబో ఏనుగు వినియోగించనున్నారు. 
 
సాధారణంగా ఆలయ వేడుకల్లో నిజమైన ఏనుగులను ఉపయోగించడం వల్ల అవి శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని జంతు ప్రేమికులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టులకెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మూగజీవాలకు ఎలాంటి హాని కలగకుండా సాంప్రదాయాలను కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో ఈ రోబోటిక్ ఏనుగును అందించడం ఒక గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం