Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ పార్వతిగా తనుశ్రీ దత్తా? : డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (15:03 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా మూడు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. వీటిలో ఒకటి యువరత్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అలాగే, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఇక మూడో చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రం పేరు 'లక్ష్మీస్ వీరగ్రంథం'. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరక్కించనున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన లక్ష్మీపార్వతిగా నటించేందుకు తెలుగు నటి శ్రీరెడ్డితో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోంది. ఇపుడు కొత్తగా మరో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి ఆజ్యంపోసిన సీనియర్ నటి తనుశ్రీ దత్తాను సంప్రదిస్తున్నట్టు సమాచారం. 
 
ఇప్పటికే దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ చిత్రంలో తనుశ్రీ దత్తా నటించేందుకు సమ్మతించినట్టయితే అదో పెద్ద సంచలనంగా మారనుంది. చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రచారం లభించడమేకాకుండా, జాతీయ మీడియా సైతం ఈ చిత్రంపై ఫోకస్ పెట్టే అవకాశాలు లేకపోలేదు. మొత్తంమీద లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రం మరోమారు వార్తలకెక్కే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments