Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా కోసం రంగంలోకి దిగిన స్టార్ డైరెక్టర్స్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (21:52 IST)
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహాతో ఓహో అనిపించుకోవాలని.. బిగ్ సక్సస్ సాధించాలని డిజిటల్ ఫ్లాట్ఫామ్‌లో దిగిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ స్టార్ డైరెక్టర్స్‌ని రంగంలోకి దింపారని తెలిసింది. ఇంతకీ.. ఆహా కోసం వర్క్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ ఎవరంటారా..? ముందుగా చెప్పుకోవాల్సింది. వంశీ పైడిపల్లి. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో మహర్షి సినిమాని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి.
 
ఆ తర్వాత మహేష్‌ బాబుతో మరో సినిమా చేయాలనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఆహా కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇక బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ చేయాల్సివుంది కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. కొరటాల పర్యవేక్షణలో ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ రెడీ అవుతుందట. దీనికి కథను కొరటాల అందించగా దర్శకత్వం మాత్రం కొరటాల శిష్యుడు అందిస్తున్నాడని సమాచారం.
 
అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఓ వెబ్ సిరీస్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. వీరితో పాటు రానా - సాయిపల్లవి జంటగా విరాటపర్వం సినిమా చేస్తున్న వేణు కూడా ఆహా కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. మరి... ఈ స్టార్ డైరెక్టర్స్ చేస్తున్న వెబ్ సిరీస్‌తో అయినా ఆహా ఓహో అనిపించుకుంటుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments