Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ మూవీకి బాలీవుడ్‌లో సీక్వెల్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (21:47 IST)
బన్నీ మూవీకి బాలీవుడ్ లో సీక్వెల్ చేయడం ఏంటి..? ఇదేదో గాసిప్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇంతకీ విషయం ఏంటంటే... స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందిన సినిమా పరుగు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ మంచి సినిమాగా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేసారు.
 
బాలీవుడ్ హీరో జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ ఈ సినిమాతో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్లో సక్సెస్ సాధించిన పరుగు మూవీ బాలీవుడ్లో కూడా సక్సెస్ సాధించింది. 
 
ఈ సినిమాకి ఇప్పుడు బాలీవుడ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీక్వెల్‌కు సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీలో బన్నీ గెస్ట్ రోల్ చేస్తే.. బాగుంటుందని ఆ మూవీ మేకర్ సాజిద్ డైరెక్టుగా బన్నీని అప్రోచ్ అయ్యారని టాక్.
 
బన్నీ గెస్ట్ రోల్ చేయడానికి ఓకే చెబుతారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదిలా ఉంటే.. నిర్మాత దిల్ రాజు కూడా పరుగు సినిమాకి సీక్వెల్ నిర్మించాలనుకుంటున్నాడట. మరి.. బొమ్మరిల్లు భాస్కర్ పరుగు సీక్వెల్‌కి ఓకే చెబుతారా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments