Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిన హెబ్బా పటేల్.. ఆ కంటెంట్ ఎక్కువేనట

వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిన హెబ్బా పటేల్.. ఆ కంటెంట్ ఎక్కువేనట
, గురువారం, 7 మే 2020 (14:56 IST)
వెబ్ సిరీస్‌లపై ప్రస్తుతం సెలెబ్రిటీలు మొగ్గుచూపుతున్నారు. తెలుగులో వెబ్ సిరీస్‌ల కల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లను టచ్ చేద్దామని మంచి క్రేజున్న తారలు కూడా సిద్ధమవుతున్నారు. ఇక అవకాశాలు తగ్గినవాళ్లు మరో ఆదాయ మార్గంగా వెబ్ సిరీస్‌లను ఎంచుకుంటున్నారు. 
 
అలా వెబ్ సిరీస్‌ల దిశగా అడుగులు వేస్తున్న వారి జాబితాలో హెబ్బా పటేల్ కూడా వుంది. ఆరంభంలో హీరోయిన్‌గా రాణించిన హెబ్బా పటేల్.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతోంది. 
 
నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించే రెండు వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. అడల్ట్ రేటెడ్ స్టైల్లో ఈ వెబ్ సిరీస్‌లు వుంటాయని చెప్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లలో హెబ్బా చాలా బోల్డ్‌గా కనిపిస్తుందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే ఆహా యాప్‌లోని మస్తీస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. అంతేకాకుండా అదే యాప్‌లో మరో రెండు వెబ్‌సిరీస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో నెట్‌​ఫ్లిక్స్‌ తీయబోయే రెండు వెబ్‌ సిరీస్‌లకు సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. రామ్‌ ‘రెడ్‌’ సినిమాలో ప్రత్యేకగీతం, రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’లో ప్రత్యేక ప్రాతలో హెబ్బా మెరవనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బా... ఇన్‌స్టాతో విసిగిపోయా: బిగ్‌బాస్‌ సీజన్ కంటిస్టెంట్ పునర్నవి