Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద సమేత 'పెనిమిటి' పాట విని థమన్ తల్లి కన్నీరుమున్నీరు...

రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్న ఎన్‌టిఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' నుంచి "పెనిమిటి" పాట విడుదలైంది. ఈ పాటలో ఇంటికి దూరమైన భర్త కోసం ఇల్లాలు పడే వేదనను కళ్లకు కట్టినట్లు చూపారు.

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (10:57 IST)
రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్న ఎన్‌టిఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' నుంచి "పెనిమిటి" పాట విడుదలైంది. ఈ పాటలో ఇంటికి దూరమైన భర్త కోసం ఇల్లాలు పడే వేదనను కళ్లకు కట్టినట్లు చూపారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించగా, ఎస్.ఎస్.థమన్ ఇచ్చిన ట్యూన్ దానికి అతికినట్లు సరిపోయింది. దీనికితోడు గాయకుడు కాల భైరవ తన గాత్రంతో పాటకు జీవం పోసారు. అన్నీ కలిపి పాట చాలా అద్భుతంగా వచ్చింది.
 
రామజోగయ్య శాస్త్రి చాలా కాలం తర్వాత చక్కటి ప్రాసతో అద్భుతమైన పదాలను ఉపయోగించి పాటకు ఒక మంచి రూపాన్ని అందించారు. పాట విన్న ప్రతి ఒక్కరూ గుండెలు పిండేసేలా ఉందని, ఇది అద్భుతమైన పాట అని మంచి కితాబు ఇవ్వడం విశేషం. సంగీత దర్శకుడు థమన్ తల్లి కూడా ఈ పాట విని కన్నీరు పెట్టుకుందని, ఆమె కన్నీళ్లతో తన షర్టు తడిచిపోయినట్లు ఆయన తెలిపారు.
 
రామజోగయ్య శాస్త్రి ఈ పాట కొన్ని తరాల పాటు నిలిచిపోతుందని, ఈ పాట రాసేందుకు తగిన సందర్భాన్ని ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు తాను రుణపడి ఉంటానని తెలిపారు. అయితే అదే స్థాయిలో ఈ పాటకు యూట్యూబ్‌లో ఒక్క రోజులోనే 3 లక్షల మిలియన్ వ్యూస్ వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments