Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో ముగిసిన కార్మికుల సమ్మె - రేపటి నుంచి షూటింగులు

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (19:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. వేతనాలను పెంచాలని కోరుతూ సినీ నిర్మాణ కార్మికులు చేపట్టిన సమ్మెను గురువారం విరమించుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి వారు తిరిగి షూటింగుల్లో పాల్గొననున్నారు. 
 
వేతనాల పెంపుపై నిర్మాతల మండలి వైపు నుంచి స్పష్టమైన హామీ రావంతో సమ్మెను విరమిస్తున్టన్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో నిర్మాతల మండలితో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఇందులో సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటల పాటు వీరు చర్చించారు. 
 
ఈ చర్చలు సానుకూలంగా ముగిశాయి. పైగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మంలి ప్రకటించింది. ఈ కమిటీ కూడా శుక్రవారం సమావేశమై కమిటీతో చర్చించి, వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటుందని, అందువల్ల కార్మికులంతా యథావిధిగా షూటింగులకు హాజరుకావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. దీంతో సినీ కార్మికులు తలపెట్టిన సమ్మె 48 గంటలు కూడా పూర్తికాకముందే ముగిసిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments