Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో ముగిసిన కార్మికుల సమ్మె - రేపటి నుంచి షూటింగులు

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (19:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. వేతనాలను పెంచాలని కోరుతూ సినీ నిర్మాణ కార్మికులు చేపట్టిన సమ్మెను గురువారం విరమించుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి వారు తిరిగి షూటింగుల్లో పాల్గొననున్నారు. 
 
వేతనాల పెంపుపై నిర్మాతల మండలి వైపు నుంచి స్పష్టమైన హామీ రావంతో సమ్మెను విరమిస్తున్టన్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో నిర్మాతల మండలితో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఇందులో సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటల పాటు వీరు చర్చించారు. 
 
ఈ చర్చలు సానుకూలంగా ముగిశాయి. పైగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మంలి ప్రకటించింది. ఈ కమిటీ కూడా శుక్రవారం సమావేశమై కమిటీతో చర్చించి, వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటుందని, అందువల్ల కార్మికులంతా యథావిధిగా షూటింగులకు హాజరుకావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. దీంతో సినీ కార్మికులు తలపెట్టిన సమ్మె 48 గంటలు కూడా పూర్తికాకముందే ముగిసిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్న బ్యూటీషియన్... ఎక్కడ?

Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

గోడపై విద్యార్థిని ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి, జైలు శిక్ష

3 వేల కార్లతో సముద్రంలో మునిగిపోయిన కార్గో నౌక!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments