ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

ఠాగూర్
మంగళవారం, 1 జులై 2025 (14:53 IST)
బాలీవుడ్ నటి షఫాలీ జరివాలా 42 యేళ్ల వయసులో ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో ఆమె మృతికి గల కారణాలను వెల్లడించారు. ఆమె మృతికి యాంటీ ఏజింగ్ మందులు, వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడమే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ కోణంలో విచారణను వేగవంతం చేశారు.
 
జూన్ 27, శుక్రవారం రాత్రి షఫాలీ అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త పరాగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చినా, కుటుంబ సభ్యులు ఆ వార్తలను ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆమె మరణంపై పలు రకాల కథనాలు ప్రచారంలోకి రాగా, పోలీసుల దర్యాప్తులో కొన్ని ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
 
తాజా దర్యాప్తు వివరాలను ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. 'శుక్రవారం షఫాలీ ఉపవాసం ఉన్నారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె యాంటీ ఏజింగ్‌కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకున్నారు. రాత్రిపూట కూడా ఖాళీ కడుపుతోనే పలు మాత్రలు వేసుకున్నారు. దీంతో ఆమె రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పడిపోయి ఉండొచ్చు' అని ఆయన తెలిపారు. బీపీ బాగా తగ్గిపోవడంతో ఆమెకు వణుకు మొదలైందని, ఆ తర్వాత కుప్పకూలిపోయారని సదరు అధికారి వివరించారు. 
 
ఈ కేసును విచారిస్తున్న అంబోలి పోలీసులు ఇప్పటివరకు 10 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. మృతురాలి భర్త, తల్లిదండ్రులు, ఇంటి పనిమనిషి సహా ఆమె కుప్పకూలినప్పుడు ఇంట్లో ఉన్నవారందరినీ విచారించారు. అయితే, ఇప్పటివరకు వారి వాంగ్మూలాల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. 
 
ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా షఫాలీ ఇంటిని సందర్శించి, ఆమె వాడిన మందులు, ఇంజెక్షన్ నమూనాలను శాస్త్రీయ పరీక్షల కోసం సేకరించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఈ మృతి కేసులోని వాస్తవం తెలుస్తుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments