Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా రోగిపై లైంగిక దాడి.. మృతి.. ప్రారంభమైన దర్యాప్తు..

Advertiesment
Rape

సెల్వి

, గురువారం, 26 జూన్ 2025 (15:13 IST)
ప్రభుత్వ ఆసుపత్రిలో లైంగిక దాడికి గురై చికిత్స పొందుతూ మరణించిన మహిళపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉస్మాన్‌పూర్ ఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం గురువారం ఈశాన్య ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, ఈ సంఘటన గురించి ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించింది. 
 
దేశ రాజధాని అంతటా సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించడంలో పోలీసు బృందానికి సహాయం చేయడానికి ఆసుపత్రి పరిపాలన నలుగురు సభ్యుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. రెండు రోజుల క్రితం జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రిలో 23 ఏళ్ల మహిళపై మరొక రోగి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. 
 
బుధవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. జూన్ 23న న్యూ ఉస్మాన్‌పూర్ స్టేషన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు నమోదైంది. మృతి చెందిన మహిళను జూన్ 21న జేపీసీ ఆసుపత్రిలో చేర్చారు. జూన్ 23న, ఆమె వార్డు వెలుపల వెళ్లినప్పుడు, ఆసుపత్రిలో మరొక రోగి ఆమెను లైంగికంగా వేధించాడని, ఆ తర్వాత ఆమెను జీటీబీ ఆసుపత్రికి తరలించారు.

ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆ తర్వాత పోలీసులు 23 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి అతనిపై దాడి నేరం కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిరాశ్రయులైన మహిళపై లైంగిక దాడి, ఆ తర్వాత జరిగిన మరణం నగరవాసులను దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురిచేసింది. ఈ దారుణ మరణంపై ప్రతిపక్షం నగర ప్రభుత్వాన్ని విమర్శించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన లైంగిక దాడి ఘటనపై ప్రశ్నలు లేవనెత్తింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెను పెళ్లి చేసుకోవాలని భర్తను చంపించిన బ్యాంకు మేనేజర్