Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో బావిలో దూకేసిన వివాహిత.. తర్వాత?

Advertiesment
suicide

సెల్వి

, బుధవారం, 25 జూన్ 2025 (10:18 IST)
విశాఖపట్నంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిందని ఆరోపణలు ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో తల్లి, ఆమె కుమారుడు మరణించగా, ఆమె కుమార్తెను కాపాడారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన కొల్లి పవన్ కుమార్, సతివానిపాలెం గ్రామానికి చెందిన కొల్లి గీత (29) తరచుగా గొడవలు పడుతుండేవారు. పవన్ మద్యానికి బానిసై గీతను వేధించేవాడు, ఆమె నుండి డబ్బు డిమాండ్ చేసేవాడు.
 
ఇలా సోమవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో జగడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన గీత తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో గీత తన ఇద్దరు పిల్లలైన కొల్లి భవనేష్ మణికంఠ (6), ఎల్‌కేజీ, కొల్లి యోక్షశ్రీ (8)తో కలిసి తన ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పవన్ కుమార్ తల్లి కొల్లి అప్పల నరసమ్మ బయటకు వచ్చేసరికి పిల్లలు గదిలో లేరని చూసింది. 
 
బావిలోంచి యోక్షశ్రీ అరుపులు విన్న ఆమె వెంటనే పొరుగువారికి సమాచారం అందించింది. వారు బాలికను రక్షించి తల్లి, కొడుకులను బయటకు తీశారు. బాలికను ఆమె తల్లి, సోదరుడితో సహా వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అయితే, గీత, భవనేష్ మణికంఠ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
ఈ విషాద సంఘటనపై బాధితురాలి తల్లి ఉరుకుటి వెంకట లక్ష్మి పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వేధింపుల ఆరోపణలపై గీత భర్త కొల్లి పవన్ కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?