Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే గేట్ క్రాసింగ్ మీదుగా పట్టాలపై నడిచిన కియా కారు.. అదుపులోకి మహిళ (video)

Advertiesment
Kia Car

సెల్వి

, గురువారం, 26 జూన్ 2025 (10:37 IST)
Kia Car
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రూరల్‌లోని శంకర్‌పల్లి సమీపంలో ఒక మహిళ తన కారును రైల్వే ట్రాక్‌పైకి నడిపింది. దీనితో గందరగోళం ఏర్పడింది. ఆ మార్గంలో చాలా గంటలు రైలు సేవలకు అంతరాయం కలిగింది. స్థానికులు ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ మహిళ దూకుడుగా వ్యవహరించి కత్తితో బెదిరించడంతో ఈ సంఘటన నాటకీయ మలుపు తిరిగింది. రైలు ఆ ప్రాంతం వద్దకు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. 
 
లోకో పైలట్ పట్టాలపై కారును గమనించి రైలును ఆపాడు. చివరికి స్థానికులు ఆ మహిళను లొంగదీసుకుని, శంకర్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొండకల్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఉదయం 7 గంటలకు రైల్వే గేట్ క్రాసింగ్ మీదుగా పట్టాలు ఎక్కి ఒక్కసారిగా కియా కారు దూసుకెళ్లారు. 
 
కొండకల్ నుంచి శంకర్పల్లి వరకు రైల్వే ట్రాక్ పైనే ఈ కారు వెళ్లిందని రైల్వే సిబ్బంది అన్నారు. రీల్స్ కోసమే రైల్వే ట్రాక్‌పై కారును సదరు యువతి నడిపినట్లు పోలీసులు తెలిపారు. యువతి లక్నోకు చెందిన రభిక సోనీగా గుర్తించారు. యువతి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలున్నాయి. పోలీసుల విచారణకు రభిక సోనీ సహకరించట్లేదని పోలీసులు తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Shukla: అంతరిక్షంలోకి శుభాన్షు శుక్లా.. 8 నిమిషాల తర్వాత భూమికి చేరిన ఫాల్కన్ 9 (video)