ఎస్పీబీ కోసం అయ్యప్ప ఆలయంలో శంకరాభరణ సంగీత సమర్పణ

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (23:21 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తిరిగి కోలుకోవాలని కోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సంగీత ప్రియులు తమతమ ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం భారతీయ సినీ ఇండస్ట్రీకి చెందిన సంగీత విభాగం కూడా సామూహిక ప్రార్థనలు నిర్వహించింది. ఇపుడు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంల సంగీత సమర్పణ కార్యక్రమం జరిగింది. 
 
కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో సంగీత సమర్పణ చేశారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఆలాపించిన 'శంకరా నాద శరీరారా పరా...' అనే పాటను దేవస్థాన వాయిద్యకారులు తమ ప్రదర్శనతో స్వామివారికి సమర్పించారు. దీనిపై అయ్యప్ప ఆలయ బోర్డు ట్రావెన్ కూర్ దేవస్వోం వర్గాలు స్పందించాయి. 
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ఆయన పేరుతో స్వామివారికి పూజలు నిర్వహించినట్టు వెల్లడించాయి. అప్పట్లో ఘనవిజయం సాధించిన శంకరాభరణం చిత్రంలో బాలు ఆలపించిన 'శంకరా నాద శరీరా పరా' గీతం సాధారణ ప్రజల్లో సైతం ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెల్సిందే. 
 
కాగా, ప్రస్తుతం ఎస్.పి. బాలు ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ.. గుండెపోటు రాకుండా ఎక్మో పరికరాన్ని అమర్చారు. దీంతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

3 కోట్ల ఐఆర్‌సీటీసీ ఖాతాలు డీయాక్టివేట్ చేసిన రైల్వే శాఖ

హిందూయేతర ఉద్యోగుల సమస్యను టీటీడీనే స్వయంగా పరిష్కరించుకోవాలి

ఐఫాతో తెలంగాణ ప్రభుత్వం కీలక బహుళ-వార్షిక ప్రపంచ స్థాయి భాగస్వామ్యం

వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని కదల్చలేరు.. మంత్రి పెమ్మసాని

బీజేపీకి సరెండర్ కావాలనుకుంటున్న వైకాపా.. కౌంటరిచ్చిన ప్రధాన మంత్రి మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments