Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోధ్‌పూర్ వేదికగా ప్రియాంకా - నిక్ జోనస్ వివాహం

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (13:28 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌లు త్వరలో మూడుముళ్ళ బంధంతో ఒక్కటికానున్నారు. ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోగా, త్వరలోనే వీరిద్దరి వివాహాన్ని వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ వివాహాన్ని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను పెళ్లి వేదికగా నిర్ణయించారు. నవంబర్ మాసంలో అక్కడి చారిత్రక ఉమేద్‌భవన్‌లో వివాహం జరగనుంది. ఇటీవలే ప్రియాంకచోప్రా, నిక్‌జోనస్ జోధ్‌పూర్‌ను సందర్శించి వివాహ ఏర్పాట్ల గురించి చర్చించారు. పెళ్లికి ఇరు కుటుంబానికి సంబంధించిన రెండొందల మంది అతిథుల్ని మాత్రమే ఆహ్వానిస్తారని సమాచారం. వివాహానంతరం హాలీవుడ్ సెలబ్రిటీస్ కోసం న్యూయార్క్‌లో గ్రాండ్ రిసెప్షన్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
 
బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో విందు ఏర్పాటు చేస్తారని సమాచారం. హాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన అనంతరం ప్రియాంకచోప్రా గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపును సంపాదించుకుంది. దాంతో ఈ సుందరి పెళ్లి వేడుక కోసం విదేశీ మీడియా సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నేపథ్యంలో చారిత్రక నగరం జోధ్‌పూర్‌లో పెళ్లి వేదికను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ ద్వితీయార్థంలో పెళ్లికి తేదిని నిర్ణయించారని తెలుస్తున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments