Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులను టార్చర్ పెట్టి ఆనందం పొందుతున్న ఎయిరిండియా : మంచు లక్ష్మీ

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (12:59 IST)
ఎయిరిండియా అధికారులపై టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మీ మరోమారు మండిపడింది. ప్రయాణికులను టార్చర్ పెట్టి ఎయిరిండియా అధికారులు ఆనందం పొందుతున్నారంటూ ఆమె తీవ్ర విమర్శలు గుప్పించింది. 
 
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి కారణం చెప్పకుండా దాదాపు 4 గంటల పాటు తనను క్యూలైనులో నిలబెట్టారంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె గురువారం వరుస ట్వీట్లు చేసింది. 
 
ప్రయాణికులను ఎయిర్ ఇండియా అధికారులు కనీసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. దీంతో ఆహారం, నీళ్లు లేకుండా పలువురు ప్రయాణికులు పుణె ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారని తెలిపింది.
 
నిజానికి ఎయిర్ ఇండియా విమానం బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తొలుత బయలుదేరాల్సి ఉందని లక్ష్మి చెప్పింది. అయితే మరో నాలుగు గంటలైనా విమానం జాడ లేకుండా పోయిందని వెల్లడించింది. 
 
ఈ విషయంపై తాము గట్టిగా నిలదిస్తే ఎయిర్ ఇండియా అధికారి సమాధానం చెప్పకుండానే పారిపోయారని తెలిపింది. చివరికి తాను హైదరాబాద్‌కు ఫోన్ చేసి అడిగితేగానీ, వాతావరణం బాగోలేని కారణంగానే విమానం రద్దయినట్లు తెలిసిందని మంచు లక్ష్మి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments