Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులను టార్చర్ పెట్టి ఆనందం పొందుతున్న ఎయిరిండియా : మంచు లక్ష్మీ

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (12:59 IST)
ఎయిరిండియా అధికారులపై టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మీ మరోమారు మండిపడింది. ప్రయాణికులను టార్చర్ పెట్టి ఎయిరిండియా అధికారులు ఆనందం పొందుతున్నారంటూ ఆమె తీవ్ర విమర్శలు గుప్పించింది. 
 
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి కారణం చెప్పకుండా దాదాపు 4 గంటల పాటు తనను క్యూలైనులో నిలబెట్టారంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె గురువారం వరుస ట్వీట్లు చేసింది. 
 
ప్రయాణికులను ఎయిర్ ఇండియా అధికారులు కనీసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. దీంతో ఆహారం, నీళ్లు లేకుండా పలువురు ప్రయాణికులు పుణె ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారని తెలిపింది.
 
నిజానికి ఎయిర్ ఇండియా విమానం బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తొలుత బయలుదేరాల్సి ఉందని లక్ష్మి చెప్పింది. అయితే మరో నాలుగు గంటలైనా విమానం జాడ లేకుండా పోయిందని వెల్లడించింది. 
 
ఈ విషయంపై తాము గట్టిగా నిలదిస్తే ఎయిర్ ఇండియా అధికారి సమాధానం చెప్పకుండానే పారిపోయారని తెలిపింది. చివరికి తాను హైదరాబాద్‌కు ఫోన్ చేసి అడిగితేగానీ, వాతావరణం బాగోలేని కారణంగానే విమానం రద్దయినట్లు తెలిసిందని మంచు లక్ష్మి చెప్పింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments