Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందడి చేసిన బాలయ్య... ఫ్యాన్స్‌తో కలిసి ‘జై సింహా’ తిలకించిన నేత

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ తిరుపతిలో సందడి చేశారు. సంక్రాంతి పండుగ కోసం చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు వచ్చిన ఆయన... భోగి మంటలు వేసి అక్కడ నుంచి

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (14:54 IST)
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ తిరుపతిలో సందడి చేశారు. సంక్రాంతి పండుగ కోసం చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు వచ్చిన ఆయన... భోగి మంటలు వేసి అక్కడ నుంచి నేరుగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత దిగువ తిరుపతిలో ఆయన సందడి చేశారు. ముఖ్యంగా, ఆయన నటించిన తాజా చిత్రం "జైసింహా". ఈనెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం తిరుపతిలోని గ్రూపు థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది. దీంతో బాలకృష్ణ తన అభిమానులతో కలిసి ఈ సినిమాను తిలకించారు. 
 
అనంతరం, బాలకృష్ణ  మీడియాతో మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎప్పుడూ తమ వెంటే ఉంటారని, సంక్రాంతి పండగకు ప్రేక్షకులు తనకు అందించిన విజయకానుక ‘జైసింహా’ అని అన్నారు. ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ గురించి ప్రస్తావిస్తూ, త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments