Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ కంటెస్టెంట్లపై మండిపడిన నాగార్జున... ఎందుకు?

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:55 IST)
బిగ్ బాస్ షో రోజుకు రోజుకు నిరాశపరుస్తుందనే టాక్ వస్తుంది. మరో వైపు ఒక వారం ఒకలా మరో వారం మరోలా ఉంటుంది అనే టాక్ కూడా ఉంది. ఆకట్టుకునే కంటెస్టంట్లు లేకపోవడంతో... వీక్షకులను మెప్పించలేకపోతున్నారు. అయినప్పటికీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అయితే.. హౌస్‌లో ఉన్న సభ్యుల ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది. అవినాష్ చేసే అద్ధం కామెడీ సుజాతకు అస్సలు నచ్చడం లేదు. కారణం తెలియదు కానీ.. పాజిటివ్‌గా తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. దివి ఎవరితోనూ కలవడం లేదు. గంగవ్వ ఆటలోకి దిగడం లేదు. అమ్మ రాజశేఖర్ కామెడీ చేయడం లేదు.. సీరియస్ అవుతున్నారు. దీంతో ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగ్ ఫైర్ అయ్యారు. 
 
వ్యక్తిగతంగా ఎవరి ఆట వాళ్లు ఆడకుండా పక్కవారికే ఎక్కువ సపోర్ట్ చేసినందుకు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆట వాళ్లు ఆడకపోతే వాళ్లకే నష్టం అని.. ఆ తర్వాత కథ వేరేలా ఉంటుందని తనదైన స్టైల్‌లో చెప్పారు. అయితే.. ఈ షో రోజురోజుకు ఆసక్తి కలిగించకపోవడంతో వీక్షకులు ఏదైనా ఇంట్రస్ట్ కలిగించేలా వెరైటీ గేమ్ స్టార్ట్ చేస్తారా..? ఇంకా ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ ఇవ్వనున్నారు అని ఎదురు చూస్తున్నారు. మరి.. బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments