Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేని ఖాతాలో 'మిస్టర్ మజ్ను' హిట్ ఖాయం : జూనియర్ ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (15:42 IST)
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను'. వెంకీ అట్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రిలీజ్ ఫంక్షన్ శనివారం రాత్రి జరిగింది. ఇందులో "మిస్టర్ మజ్ను" ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. 
 
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, అఖిల్‌కు ఒక్క హిట్టు రావాలని ఎన్నోసార్లు దేవుడిని ప్రార్థించానని చెప్పాడు. ఈసారి హిట్ కొడతాడని నమ్మకంగా ఉందన్నాడు. ట్రైలర్‌లోని కొన్ని డైలాగులు ఆరెంజ్ సినిమాను గుర్తుచేస్తున్నా.. ఈ మూవీకి.. ఆ చిత్రానికి సంబంధం లేదని ట్రేడ్ టాక్.
 
ఇకపోతే, ఈ చిత్రం ట్రైలర్ 2 నిమిషాల 8 సెకన్లు ఉండగా, హీరోయిన్ ఏది చేస్తే దాన్నే హీరో కూడా ఫాలో అవుతుంటాడు. 'నిధికి కోపం వచ్చి, నువ్వెంత ట్రై చేసినా నేను పడను అంటుంది. అఖిల్‌ థాంక్స్‌ అంటాడు. థాంక్స్‌ ఎందుకు అని నిధి అడుగుతుంది. నేను హాయిగా ఇంకో అమ్మాయిని ట్రై చేసుకుంటాను' అని అఖిల్‌ చెప్పడం ఫన్నీగా ఉంది. ఇలాంటి డైలాగులు అనేకం ఉన్నాయి. 
 
ఇకపోతే, అఖిల్‌, నిధి మధ్య కెమిస్ట్రీని చాలా అందంగా చూపించారు. 'నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ.. నా వల్ల ఒక్కరు ఏడ్చినా ఖచ్చితంగా అది నా తప్పు అవుతుంది' అని నిధితో నిఖిల్ అంటున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments