Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (15:26 IST)
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకున్నట్టు బీ టౌన్‌లో తెగ చర్చ సాగుతోంది. దీంతో మౌనీ రాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. తన తదుపరి చిత్రం "ది భూత్నీ" సినిమా ఈవెంట్‌లో ఆమె పాల్గొన్న నాటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అందం కోసం ఆమె సర్జరీ చేయించుకున్నారని, దాంతో ముఖ కవళికలు కూడా మారిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెట్టింట తనపై సాగుతున్న ప్రచారంపై మౌనీ రాయ్ స్పందించారు. 
 
"నాపై కామెంట్స్ చేసేవాళ్లు నాకు కనిపించరు. కాబట్టి వాళ్ల మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని పెద్దగా పట్టించుకోను. ఇతరులను ట్రోల్ చేస్తూ ఆనందాన్ని పొందాలనుకుంటే మాత్రం మనం ఏం చేస్తాం. ఎవరికి నచ్చినట్టు వాళ్లని ఉండనివ్వండి" అంటూ వేదాంత ధోరణితో మాట్లాడారు. 
 
కాగా, సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన సినిమాల్లోకి అడుగుపెట్టారు మౌనీ రాయ్... "నాగిని" సీరియల్‌తో అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ నటించిన "గోల్డ్" చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ప్రస్తుంత ఆమె "ది భూత్నీ"లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ మూవీ ఏప్రిల్ 18న విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments