Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని స్మ‌రించుకున్న మెగాస్టార్‌

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:04 IST)
Nagababu- chiru
మెగాస్టార్ చిరంజీవి త‌న తండ్రి వెంక‌ట్రావ్ గారిని ఏడాది కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా స్మ‌రించుకున్నారు. నాగ‌బాబు కూడా ఆయ‌న‌తో వున్నారు. త‌మ స్వ‌గృహంలోనే ఫొటోకు న‌మ‌స్క‌రిస్తూ, ఆయ‌న‌కు ఇష్ట‌మైన‌వి ముందుంచి శుక్ర‌వారంనాడు శ్ర‌ద్దాంజ‌లి ఘటించారు.

 
నాన్న గారి సంవత్సరీకం సందర్భంగా ఆయన స్మృతులని తలుచుకుంటూ, మాకు జన్మనిచ్చిన ఆ మహనీయుడు ఏ లోకంలో వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అంటూ ట్వీట్ చేశారు.

 
సమాజం కోసం తపించే ముగ్గురు మొనగాళ్లను ఇచ్చిన మహానుభావుడు "వెంకటరావు" గారి ఆత్మకు తప్పకుండా సద్గతి కలిగి ఉంటుందని ట్విట్ట‌ర్‌లో కొంద‌రు స్పందించారు. ఇదిలా వుండ‌గా, గురువారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసారు. చిరు తన పెరట్లో కొన్ని నెలల క్రితం పొట్లకాయ విత్తనాలను నాటగా, అది పెరిగి, ఇప్పుడు పొట్లకాయలు కూడా అయ్యాయట.


పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి నా సెల్యూట్” అంటూ  రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments