Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ల రాజకీయం : ఏపీలో తగ్గింపు - తెలంగాణాలో పెంపు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (16:57 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల రాజకీయంనడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద రచ్చే సాగుతోంది. ఏపీ ప్రభుత్వ వైఖరిని చాలా మంది తీవ్రంగా తప్పుబడుతున్నారు. 
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది కోలీవుడ్‌కు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అనుమతిచ్చిన మేరకు మల్టీప్లెక్స్‌లలో గరిష్ట ధర రూ.250కి పెంచుకునే వెసులుబాటువుంది. కానీ, ఏపీలో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర రూ.150 మాత్రమే కావడం గమనార్హం. 
 
తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిన రేట్ల ప్రకారం మల్టీప్లెక్స్‌లలో కనిష్ట ధర రూ.100గాను గరిష్ట ధర రూ.250కి పెరగనుంది. అధికారుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
 
అయితే, ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తివిరుద్ధం. ఏపీలోని మల్టీప్లెక్స్‌లలో కనీస ధర రూ.50గా ఉంటే గరిష్ట ధర రూ.150గా ఉంది. టిక్కెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం. ఈ ధరలపై చిత్రపరిశ్రమ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ప్రస్తుతం పరిస్థితి ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమ అన్నట్టుగా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments