చిరంజీవి బాలీవుడ్‌కు ఎందుకు దూరంగా వున్నారు? మెగాస్టార్ ఏం చెప్పారు?

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (18:51 IST)
ముంబైలో గ్రాండ్‌గా జరిగిన సైరా నరసింహారెడ్డి టీజర్ లాంచ్‌లో అక్కడి మీడియా టీమ్‌ను ప్రశ్నల వర్షంలో ముంచెత్తి కావలసిన సమాధానాలను రాబట్టుకుంది. ఈ సందర్భంగా, ప్రతినిధులు చిరుని ఇంత కాలం బాలీవుడ్‌కు దూరంగా ఎందుకు ఉన్నారు అని అడిగారు. వారు అడగడానికి కారణం లేకపోలేదు. చిరు చేసిన చివరి హిందీ స్ట్రెయిట్ మూవీ ది జెంటిల్ మెన్. ఇది 1994లో విడుదలైంది. 
 
అంతకు ముందు ఆజ్ కా గూండా రాజ్, ప్రతిబంద్‌లు కమర్షియల్ సూపర్ సక్సెస్‌ని అందుకుని కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. ఆ టైంలో చిరంజీవి ఇకపై రెగ్యులర్‌గా హిందీ సినిమాలు చేస్తారనే టాక్ కూడా పత్రికల్లో వచ్చేది. కానీ చిరు ఆ తర్వాత మళ్ళీ వాటి జోలికే వెళ్ళలేదు. అందుకే ఈ సందర్భాన్ని వాడుకుని జర్నలిస్ట్ ఈ ప్రశ్న అడగగా, చిరు సమాధానం ఇచ్చారు. 
 
నిజానికి దానికి స్పష్టమైన కారణం అంటూ ఏదీ లేదని, తెలుగు సినిమాల్లో విపరీతంగా బిజీ కావడం వల్ల ఆ తర్వాత రాజకీయాల్లో కొన్నేళ్లు గడపాల్సి రావడం వంటి కారణాల వల్ల బాలీవుడ్ గురించి ఆలోచించే వ్యవధి లేకపోయిందని చెప్పారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్ కథ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments