Manchu Vishnu Reaction On Manoj మంచు ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించవద్దు

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:49 IST)
Manchu Vishnu Reaction On Manoj Vs Mohan Babu Issue మంచు కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని భూతద్దంలో చూపించి పెద్దగా చిత్రీకరించవద్దని మీడియాకు హీరో మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. మా ఫ్యామిలీలో చెలరేగిన అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
సీనియర్ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన వివాదం ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మంచు మనోజ్‌లు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మంచు మనోజ్, మంచు మోహన్ బాబుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడి షరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులను నమోదు చేశారు. 
 
మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్, ఈయన భార్య మంచు మౌనిక రెడ్డిలపై పోలీసులు 329, 351 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు అనుచరులపై కూడా 329, 351, 115 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
ఇదిలావుంటే, విదేశాల నుంచి మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరానికి చేరుకున్న మంచు విష్ణు.. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని తన నివాసానికి వెళ్లే మార్గమధ్యంలో మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, ఈ వివాదంపై కూడా డాక్టర్ మోహన్ బాబు కూడా స్పందించారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని, ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది, పరిష్కరించుకుంటామన్నారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు పరిష్కరించి, అందరూ కలిసివుండేలా చేశానని చెప్పారు. పైగా, అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments