Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు మనోజ్ ఇంటి జనరేటర్‌లో చక్కెర పోసిన మంచు విష్ణు!!

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (09:53 IST)
మంచు ఇంట్లో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. సినీ నటులు మంచు మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ల మధ్య ఆస్తి గొడవలు చెలరేగి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఈ క్రమంలో ఓ మీడియా చానల్ ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్న కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏక్షణమైనా అరెస్టు కావచ్చు. ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉండగా, మంచు మనోజ్ తాజా ఆరోపణలతో మరో వివాదం తెరపైకి వచ్చింది.
 
విష్ణు.. తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేయించాడని మనోజ్ ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేశారు. తాను సినిమా షూటింగు‌కు వెళ్లిన సమయంలో విష్ణు.. తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించి జనరేటర్లలో పంచదార పోయించాడని, దీంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మనోజ్ పేర్కొన్నాడు.
 
జనరేటర్ సమీపంలోనే వాహనాలు, గ్యాస్ కనెక్షన్ ఉన్నాయని, వారి చర్యలతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో భయపడ్డామన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నానని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మనోజ్ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments