Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేజర్ పాత్ర గ‌ర్వంగా వుందంటున్న అడవి శేషు

Major character
Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (14:14 IST)
క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు వంటి భిన్న‌మైన కాన్సెప్ట్‌తో ముందుకు వ‌చ్చిన అడ‌విశేషు.. ఈసారి 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా క‌న్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ధైర్య‌సాహ‌సాల‌కు పెట్టింది పేరు. అందుకే ఆయ‌న స్టిల్‌ను అడ‌విశేషు త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురువారంనాడు విడుద‌ల చేశారు.
 
నిస్వార్థప‌రుడు, ధైర్యవంతుడు మ‌నంద‌రికీ ఎంతో ఇష్ట‌మైన‌ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా న‌టించ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని అడ‌విశేషు తెలియ‌జేస్తున్నారు. అందుకు త‌గిన విధంగా రైఫిల్ షూటింగ్ చేస్తున్న స్టిల్‌ను ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు `మేజర్` ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌.
 
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది చిత్ర యూనిట్‌.
 
27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వ‌ర్ధంతి సందర్భంగా హీరో అడివి శేష్ ‌లుక్ టెస్ట్ పోస్ట‌ర్‌‌తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి‌ వెల్లడించిన వీడియోను రిలీజ్ చేసిన‌ విష‌యం తెలిసిందే. మేజర్ టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయాల్లో షూటింగ్ తిరిగి ప్రారంభించి అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఇప్పటి వరకు 70% షూట్ పూర్తి చేసింది.
 
తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న‌ ఈ మూవీకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments