Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబో 2పాయింట్ ఓకు మహేష్ ఫిదా.. చిట్టి కోసం వెయిటింగ్..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (09:08 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న రోబో 2పాయింట్ ఓ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది.


ఈ సినిమాపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. ఈ సినిమా విజువల్స్ , కాన్సెప్ట్ అదిరిపోయాయి. చిట్టి చేసే విధ్వంసాన్ని స్క్రీన్‌ పై చూసేందుకు ఎదురుచూస్తున్నా. శంకర్, రజనీకాంత్ సార్, అక్షయ్ కుమార్, ఏఆర్ రహ్మన్, మీ టీమ్ మొత్తానికీ అభినందనలు అంటూ మహేష్ బాబు వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల విడుదలైన '2.0' ట్రైలర్‌ని చూసి ఫిదా అయినట్లు మహేష్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. సినీ అభిమానులు ఈ సినిమా గురించి ఎంగా ఉహించుకున్నారో, అంతకంటే ఎక్కువ విసువల్ ఎఫెక్ట్స్ ట్రైలర్లో కనిపించడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక మహేష్ బాబు ట్వీట్‌ పై అక్షయ్ కుమార్ స్పందించారు. దీన్ని రీట్వీట్ చేసిన అక్షయ్ 'కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. ఈ చిత్రం నెలాఖరులో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
 
కాగా రజనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.0 అఫీషియల్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. 4డీ టెక్నాలజీతో ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. శంకర్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గని విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments