Webdunia - Bharat's app for daily news and videos

Install App

2.0 కోసం శంక‌ర్ అన్నిసార్లు క‌థ మార్చాడా..? ఆయన అతిజాగ్రత్త ఏం చేస్తుందో?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (20:00 IST)
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్టర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ 2.0. భార‌త‌దేశంలో అత్యంత భారీ బ‌డ్జెట్ 600 కోట్ల‌తో రూపొందిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేసారు. హాలీవుడ్ మూవీని చూసిన ఫీల్ క‌లిగిస్తోన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమా నాలుగు సంవ‌త్స‌రాల పాటు సెట్స్ పైన ఉంది. అయినా... ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. చాలా రీషూట్లు చేసాడు శంక‌ర్. బ‌డ్జెట్ 600 కోట్లు అవ్వ‌డానికి ఇదే ప్ర‌ధాన కార‌ణం. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ క‌థ‌ని శంక‌ర్ మూడుసార్లు మార్చాడ‌ట. దీంతో రీషూట్ల మీద రీషూట్లు చేసుకుంటూ వెళ్లాల్సి వ‌చ్చింది. రెహ‌మాన్ కూడా ఈ సినిమా కోసం మూడుసార్లు రీ-రికార్డింగ్ కూడా మార్చాల్సివ‌చ్చింది. అంటే.. ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిన త‌ర్వాత కొత్త సీన్ రాసార‌న్న‌మాట‌. నాలుగేళ్లుగా క‌థ‌లో మార్పులు చేస్తూనే ఉన్నార‌న్న‌మాట‌. శంక‌ర్ గ‌త చిత్రం ఐ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో 2.0 సినిమాపై మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. మ‌రి.. ఈ అతి జాగ్ర‌త్త ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments