Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎందుకు పాటలో వర్మ టార్గెట్ చేశారా? లక్ష్మీపార్వతి ఏమంటున్నారు?

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (12:50 IST)
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఎందుకు అనే పాటను 'వర్మ' తాజాగా రిలీజ్ చేశారు. 
 
గతంలో వెన్నుపోటు పాటను విడుదల చేసిన వర్మ.. మంగళవారం సాయంత్రం ఎందుకు? అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటపై అన్నివర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పాటపై లక్ష్మీపార్వతి స్పందించారు. 
 
వర్మ తాజాగా విడుదల చేసిన ఎందుకు పాట తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఈ పాటలో దర్శకుడు తనను విమర్శించినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే పాట చివరిలో మాత్రం ఇవన్నీ ప్రశ్నలేనని వర్మ చెప్పారన్నారు. తెలుగుదేశం నేతలు అప్పట్లో తన కులం తనది కాదనీ, తన ఊరు నిజంగా తన సొంతూరు కాదని తప్పుడు ప్రచారం చేశారని లక్ష్మీపార్వతి విమర్శించారు.
 
తాను ఎన్టీఆర్ భార్యను కాదనీ, అసలు ఆయన తనను పెళ్లే చేసుకోలేదని 20 ఏళ్లుగా దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. బయోపిక్ అంటే సుఖంగా ఉండటమే కాదనీ, ఆయన పడిన కష్టాలు, బాధలను చూపించాలని స్పష్టంచేశారు. సినిమాల్లోకి రాకముందు సైతం ఎన్టీఆర్ కష్టాలు పడ్డారని వ్యాఖ్యానించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cloudburst: జమ్మూ కాశ్మీర్‌ జల విషాధం: 45 మంది మృతి, 120 మందికి గాయాలు (video)

ఈసారి పౌరులకు డబుల్ దీపావళి.. జీఎస్టీపై భారీ కోత.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: మోదీ

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ- పాక్‌కు మోదీ వార్నింగ్ (video)

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments