"రైతు"గా ఎన్టీఆర్.. బాలయ్య కోసం కథ రాసి తారక్‌ను దించేశాడు..(video)

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (19:19 IST)
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన "రంగమార్తాండ" నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్నాడు. మరాఠీ సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తయిన తర్వాత కృష్ణవంశీ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 
 
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ డేట్స్ గురించి ఎంక్వయిరీ చేయడానికి సైతం వెళ్లారు కృష్ణవంశీ. 2006లో ఎన్టీఆర్ మరియు కృష్ణ వంశీ "రాఖీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
 
మరోవైపు కృష్ణ వంశీ బాలకృష్ణ హీరోగా "రైతు" అనే సినిమా చేయాలనుకున్నారు కానీ ఆ సినిమా కూడా ఇప్పట్లో మొదలయ్యే దాఖలాలు లేవు. అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణవంశీ "రైతు" కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అదే కథను ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి చేయాలని అనుకుంటున్నారట. 
 
అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు "రంగమార్తాండ" సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి... 158 మందికి తప్పిన ప్రాణముప్పు

నకిలీ మద్యం కేసు : ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: కాకినాడలో ఉన్నతి ఫౌండేషన్ కొత్త వృత్తి శిక్షణా కేంద్రం ప్రారంభం

చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనీ యువకుడిని హత్య చేసిన అన్న

Telangana: తెలంగాణలో రీ-ఎంట్రీ ఇవ్వనున్న చంద్రబాబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments