Webdunia - Bharat's app for daily news and videos

Install App

''క్రాక్''కు షాక్ మార్నింగ్ షో రద్దు..

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (10:35 IST)
మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'క్రాక్‌'. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా విడుదల కాబోతోంది. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 1000 థియేటర్లలో ప్రదర్శించబడేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది.
 
సాధారణంగా భారతదేశంలో విడుదలవ్వడానికంటే ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు పడుతూ ఉంటాయి. మన తెలుసు సినిమాలకు ప్రీమియర్ షోల టాక్ చాలా ముఖ్యం. కానీ ఎందుకో ప్రీమియర్ షోలు పడలేదు. శుక్రవారం రాత్రి, జనవరి 8వ తేదీన అమెరికాలో ప్రీమియర్స్ షోలు రద్దు అయ్యాయి. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 'క్రాక్' మార్నింగ్ షో రద్దు అయింది. దీంతో సోషల్ మీడియాలో ఈరోజు సినిమా విడుదల అవుతుందా లేదా అనే డౌట్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఫైనాన్సియల్ క్లియరెన్స్ అయిపోయిందని, 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు పడతాయని 'క్రాక్' పీఆర్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫేక్‌బుక్‌లో పరిచయం.. భోజనానికి పిలిచి యువతిపై లైంగికదాడి...

Chips: అమ్మా, నేను దొంగతనం చేయలేదు.. చిప్స్ ప్యాకెట్ కోసం అంత అవమానమా?

Miss World 2025: మిస్ వరల్డ్ 2025 పోటీల గ్రాండ్ ఫినాలే- సోనూసూద్‌కు ప్రత్యేక అవార్డ్

Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments