Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగ‌నా రనౌత్‌కు చుక్కలు-ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ స‌మ‌న్లు జారీ

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:29 IST)
సిక్కుల‌ను కించ‌ప‌రిచే రీతిలో బాలీవుడ్ నటి కంగ‌నా రనౌత్ కామెంట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌కు చుక్కెదురైంది. కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ స‌మ‌న్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘ‌వ చ‌ద్దా ప్యానెల్ ముందు డిసెంబ‌ర్ ఆరో తేదీన హాజ‌రుకావాలంటూ ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ ఆదేశించింది. 
 
ఇప్పటికే సిక్కుల‌పై అనుచిత రీతిలో వ్యాఖ్య‌లు చేసిదంటూ కంగ‌నా రనౌత్‌పై ముంబైలో కూడా కేసు నమోదైంది. అయితే ఏడాది కాలంగా రైతులు చేసిన ధ‌ర్నాలను ఖ‌లిస్తానీ ఉద్య‌మంగా అభివ‌ర్ణిస్తూ కంగ‌నా ఆరోప‌ణ‌లు చేసింది. 
 
దీంతో సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆమె కావాల‌నే ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు. 
 
సిక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన షూ కింద దోమల్ని నలిపివేసినట్లు నలిపివేశారని.. అలాంటి వారే దేశానికి కావాలంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న రైతులను ఖలీస్తానీయులుగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments