Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంగ‌నా పిచ్చిత‌న‌మా..? లేక దేశ‌ద్రోహమా? వరుణ్ గాంధీ ఫైర్

Advertiesment
Varun Gandhi
, గురువారం, 11 నవంబరు 2021 (16:45 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'భార‌త‌దేశానికి 2014లో స్వాతంత్ర్యం వ‌చ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్షం' అని కంగ‌నా వ్యాఖ్యానించింది. ఓ జాతీయ స్థాయి న్యూస్ ఛానెల్‌లో కంగ‌నా ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 
 
వీటిపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ఘాటుగానే స్పందించారు. కంగ‌నా పిచ్చిత‌న‌మా..? లేక దేశ‌ద్రోహంగా భావించాలా అని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల ప‌ద్మ శ్రీ అవార్డు అందుకున్న కంగ‌నా.. ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కొనియాడారని గుర్తుచేశారు. 
 
భార‌త జాతిపిత మ‌హాత్మాగాంధీ త్యాగాల‌ను అవ‌మానించ‌డం స‌రికాదన్నారు. గాంధీని చంపిన గాడ్సేను పొగ‌డ‌డం దారుణ‌మ‌న్నారు. ఇప్పుడేమో.. మంగ‌ళ్ పాండే, రాణి ల‌క్ష్మీభాయి, భ‌గ‌త్ సింగ్, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌తో పాటు ల‌క్ష‌లాది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులను అగౌర‌వించ‌డం స‌రికాదు అని వరుణ్ గాంధీ హితవు పలికాలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్య ఆరోగ్యశాఖలో దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి