Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తులపై దయ చూపొద్దు : కంగనా రనౌత్

Advertiesment
మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తులపై దయ చూపొద్దు : కంగనా రనౌత్
, ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:59 IST)
మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తుల పట్ల ఏమాత్రం దయ చూపొద్దంటూ అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. టాలీవుడ్ జంట నాగ చైతన్య, సమంతలు తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై వ్యాఖ్యానించింది. 'మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తుల పట్ల దయ చూపడం మానేయండి' అని ప్రజలను కోరింది. 
 
ఈ ఆకతాయిలు అభిమానుల నుండి ప్రశంసలు అందుకోవడం సిగ్గుచేటు అని కూడా ఈ నటి పేర్కొన్నారు, అయితే రిలేషన్‌లో ఉన్నప్పుడు మహిళ గురించే ఎప్పుడూ తీర్పులు చెబుతారని ఆమె అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై రేవ్ పార్టీలో బాలీవుట్ స్టార్ హీరో తనయుడు?