Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీతో మరోసారి చిందేయనున్న చందమామ?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (13:21 IST)
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్.. అనే స్పెషల్ సాంగ్‌లో ఊర మాస్ స్టెప్పులు వేసి అభిమానుల్ని ఫిదా చేసింది. తాజాగా ఆమె మరో ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురంలో. 
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను కుటుంబ అనుబంధాలు, అప్యాయతల కలబోతగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కథకు తగ్గట్టు ఓ స్పెషల్ సాంగ్‌ని తెరకెక్కించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ పాటలో కాజల్ ఆడిపాడనుందని చెబుతున్నారు. సినిమాలో కథకు తగ్గట్టు సందర్భానుసారం ఈ పాట రావడం వల్ల ఈ ఐటెంసాంగ్‌లో నర్తించడానికి కాజల్ అంగీకరించినట్లు సమాచారం. 
 
త్వరలో ఈ పాటను అల్లు అర్జున్, కాజల్‌లపై భారీ హంగులతో తెరకెక్కించనున్నట్లు తెలిసింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments