Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట... విదేశాలకు పర్మిషన్ అక్కర్లేదు...

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (11:10 IST)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో ఉపశమనం లభించింది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమెకు గతంలో విధించిన బెయిల్ షరతును సవరించింది. దీంతో కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు జాక్వెలిన్‌కు వెసులుబాటు లభించింది. 
 
దాదాపు రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ అత్యంత ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గత ఏడాది ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దానికింద ఆమె విదేశాలకు వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు దానిని సవరించింది. 
 
నిందితురాలు ఇప్పటివరకు ఐదు సందర్భాల్లో విదేశాలకు వెళ్లేముందు ముందస్తు అనుమతి తీసుకున్నారని, ఎక్కడా బెయిల్ ద్వారా లభించిన స్వేచ్చను ఆమె దుర్వినియోగం చేయలేదని ఢిల్లీ పాటియాలా కోర్టు గుర్తించింది. 'దేశాన్ని విడిచే వెళ్లేముందు ముందస్తు అనుమతి గజిబిజిగా ఉండొచ్చు. అలాగే ఒక నటిగా ఆమె అవకాశాలు కోల్పోవడానికి దారితీయొచ్చు' అని వ్యాఖ్యానిస్తూ, తాజాగా బెయిల్ నిబంధనలను సడలించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments