Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరాలో హైలైట్ సీన్ ఇదే... ఇంత‌కీ ఏంటా సీన్..?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (14:07 IST)
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ సంచ‌ల‌న చిత్రం అక్టోబ‌ర్ 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్తగా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచే ఒక సన్నివేశానికి సంబంధించిన సమాచారాన్ని ఈ పోస్టర్ ద్వారా ఇచ్చారు. నోస్సం ఫోర్ట్ నేపథ్యంలోని యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. దేశ విదేశాలకి చెందిన ఆర్టిస్టులు.. ఫైటర్స్ కలుపుకుని 2000 మందితో, 35 రాత్రుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను గ్రాండ్‌గా చిత్రీకరించినట్టుగా చెప్పారు. 
 
రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సన్నివేశం ఉంటుందని చెబుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరుగుతున్నాయి. ఈ సినిమా విజ‌యం పై చిత్ర యూనిట్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి... ఈ సంచ‌ల‌న చిత్రం సైరాతో మెగాస్టార్ ఏ స్థాయి విజ‌యాన్ని సాధిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments