Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (13:10 IST)
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వచ్చిన వేణు మాధవ్.. బుధవారం తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 
 
వేణుమాధవ్ మరణవార్తతో సినీ ప్రముఖుల, కుటుంబీకులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
వేణు మాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఓ షో చేశాడు. ఆ షో దివంగత ఎన్టీఆర్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. కొంత కాలంపాటు టీడీపీ కార్యాలయంలో కూడా వేణుమాధవ్ పని చేశారు. 
 
ఆ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టారు. సంప్రదాయం' చిత్రంతో వెండితెరకు ఆయన పరిచయమయ్యాడు. ఆపై స్టార్ కమెడియన్‌గా ఎదిగి.. దాదాపు 500 సినిమాలకు పైగా నటించాడు. అతని మరణ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments