Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర హీరోయిన్ కావాలంటున్న రాజమౌళి...

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (13:12 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "ట్రిపుల్ ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల ఎంపిక ఇప్పటివరకు జరగలేదు. అయితే, ఈ చిత్రంలో లేడీ ప్రతినాయక పాత్రకు పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్ ప్రియమణిని ఆయన ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమౌళి దృష్టి కుర్రకారు హీరోయిన్‌పై పడినట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఈషా రెబ్బా పేరును ఆయన పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్‌తో పాటు.. అనూ ఇమ్మాన్యుయేల్, రష్మిక మందన్నా తదితరుల పేర్లను ఆయన పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇపుడు ఈషా రెబ్బా పేరు తెరపైకి రావడం గమనార్హం.
 
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పైగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. అందుకే మంచి హీరోయిన్లను ఎంపిక చేసి వారితో అదిరిపోయే స్టెప్పులేసి థియేటర్‌లో హోరెత్తించాలన్న ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో నటీనటుల పేర్లను కూడా వెల్లడించాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments