Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాని చెప్పింది ఒకటి.. జనాల్లోకి వెళ్లింది మరొకటి : నిర్మాత దిల్ రాజు

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (08:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వ్యవహారంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఆయన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని కోరారు. 
 
తన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడిన తర్వాత రిలీజైన సినిమా తమదేనని, నాని, తన కాంబినేషన్‌లో వచ్చిన 'వి' సినిమా అని గుర్తుచేశారు. 
 
నాని ఏం చెప్పాడన్న విషయాన్ని ఆయన మనస్సులోకి వెళ్లి చూడాలని, అపుడే ఆయన బాధ ఏంటో అర్థమవుతుందని అన్నారు. తన రెండు సినిమాలు ఓటీటీకీ వెళ్లిన బాధ ఆయనలో ఉందన్నారు. నిజానికి నాని చెప్పిన విషయం ఒక్కటైతే.. జనాల్లోకి వెళ్లింది మరొకటి అని దిల్ రాజు గుర్తుచేశారు. 
 
అలాగే, సినిమా టిక్కెట్ ధరల విషయంలో త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తామని చెప్పారు. అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సినీ రంగ సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌కు వివరించేందుకు చిత్ర పరిశ్రమ తరపున ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కమిటీలో పరిశ్రమకు చెందిన పెద్దలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments