Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేక్ష‌కుల‌ను అవ‌మానించారు... నేచుర‌ల్ స్టార్ నాకొద్దు!

ప్రేక్ష‌కుల‌ను అవ‌మానించారు... నేచుర‌ల్ స్టార్ నాకొద్దు!
విజ‌య‌వాడ‌ , గురువారం, 23 డిశెంబరు 2021 (14:26 IST)
ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ణ‌యాల‌పై నేచుర‌ల్ స్టార్ హీరో నాని నిర‌స‌న తెలిపారు. సినిమా టిక్కెట్ల‌పై సినీ నటుడు నాని మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించింద‌ని హీరో నాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొత్త సినిమా రిలీజ్ అయితే, ఆ  థియేటర్ల కంటే, పక్కనున్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువైంద‌ని ఎద్దేవా చేశారు. 

 
సినిమా టికెట్ ధర పెంచినా, కొనే సామర్థ్యం తెలుగు ప్రేక్షకులకు ఉంది. అయినా తాను ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుంద‌ని హీరో నాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నా పేరు ముందు నేచురల్ స్టార్ తీసెద్దాం అనుకుంటున్నా అని హీరో నాని పేర్కొన్నారు.

 
అయితే, సినీ వ‌ర్గాల విమ‌ర్శ‌ల‌ను మంత్రి బొత్స స‌త్య‌న్నారాయ‌ణ ఖండించారు. సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా? మేమింతే, ఎంత అంటే అంత వసూలు చేస్తామంటే కుదరదు.. సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి, అందుకే ధరలు తగ్గించాం అని మంత్రి బొత్స స‌మాధానం ఇచ్చారు. 

 
తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్ల అమ్మకాలు కొనసాగించాలన్న అధికారుల ఆదేశాలతో థియేటర్లను యాజమాన్యాలు మూసివేశాయి. జిల్లాలోని 50కి పైగా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణం తీసిన టిక్ టాక్ వీడియో... తూటా పేలింది.. అంతే..?