Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెగా అభిమానులకు ఆర్థికసాయం: నిర్మాత దిల్ రాజు

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (13:40 IST)
రాజమండ్రి వేదికగా రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు హాజరైన అభిమానుల్లో ఇద్దరు తమతమ ఇళ్లకు తిరిగిళుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22)లు ఇంటికి తిరిగి వెళుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున రూ.10 లక్షలు ప్రకటించారు. 
 
అలాగే, ఈ ఘటనపై ఆయన స్పందించారు. 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవడం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినపుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments