రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెగా అభిమానులకు ఆర్థికసాయం: నిర్మాత దిల్ రాజు

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (13:40 IST)
రాజమండ్రి వేదికగా రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు హాజరైన అభిమానుల్లో ఇద్దరు తమతమ ఇళ్లకు తిరిగిళుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22)లు ఇంటికి తిరిగి వెళుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున రూ.10 లక్షలు ప్రకటించారు. 
 
అలాగే, ఈ ఘటనపై ఆయన స్పందించారు. 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవడం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినపుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : జగన్‌పై చంద్రబాబు ఘన విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments