రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెగా అభిమానులకు ఆర్థికసాయం: నిర్మాత దిల్ రాజు

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (13:40 IST)
రాజమండ్రి వేదికగా రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు హాజరైన అభిమానుల్లో ఇద్దరు తమతమ ఇళ్లకు తిరిగిళుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22)లు ఇంటికి తిరిగి వెళుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున రూ.10 లక్షలు ప్రకటించారు. 
 
అలాగే, ఈ ఘటనపై ఆయన స్పందించారు. 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవడం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినపుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Watching TV: పదివేల రూపాయలు ఇవ్వలేదని.. తల్లిని హత్య చేసిన కుమారుడు.. ఎక్కడ?

మా జోలికి వస్తే యుద్ధ విమానాల కిందే సమాధి చేస్తాం ... భారత్‌కు పాక్ హెచ్చరిక

టమోటాలను రోడ్డున పారేస్తున్న రైతులు.. నిరసన- ట్రాఫిక్ జామ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఓటు వేసేందుకు ముస్లిం మహిళలు బురాఖా తీయాల్సిందే.. బీజేపీ

Amaravati: అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం.. అక్టోబర్ 13న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments