Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యూస్ కోసం నన్ను చంపేశారు : హీరో సునీల్

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:57 IST)
సోషల్ మీడియాలో ఏర్పడిన పోటీ కారణంగా పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయని సినీ హీరో సునీల్ వ్యాఖ్యానించారు. ఇటీవల వ్యూస్ కోసం ఏకంగా తాను చనిపోయినట్టు వార్తలు రాశారని, అంటే వ్యూస్ కోసం తనను చంపాలా? అంటూ ప్రశ్నించారు. 
 
ప్రస్తుతం సునీల్ నటించిన చిత్రం చిత్రలహరి. ఇందులో హీరో సాయి తేజ్. ఆయనతో కలిసి సునీల్ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించాడు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, 'సోషల్ మీడియా కారణంగా పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక వెబ్‌సైట్ వాళ్లు.. రోడ్డు ప్రమాదంలో నేను చనిపోయానని రాసేశారు. ఆ వార్త వలన వాళ్లకి ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక మిలియన్ వ్యూస్ కోసం నన్ను చంపేస్తారా? ఇలాంటి వార్త కారణంగా ఆ ఇంట్లో వాళ్లు ఎంత బాధపడతారో తెలియాలంటే, ఇలాంటి వార్తను రాసినవారి కుటుంబ సభ్యులపై ఇలాంటి వార్త వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏ వార్తనైనా నిజానిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుంది' అని సలహా ఇచ్చారు. 
 
కాగా, కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్.. హీరోగా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ ఎక్కువగా వస్తుండంతో తిరిగి కమెడియన్‌గా స్థరపడాలని నిర్ణయించుకున్నాడు. ఫలింతంగా పలు చిత్రాల్లో కమెడియన్‌ పాత్రల్లో నటించేందుకు సమ్మతం తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments