Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిరంజీవి "వాల్తేరు వీరయ్య"

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (13:57 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. శృతిహాసన్ నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో ఏకంగా రూ.108 కోట్లను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ చిత్రంతో చిరంజీవితో రవితేజ తోడుకావడంతో పాటు రెండో భాగంలో ఎమోషన్ చేరింది. దీంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షించింది. పైగా, ఈ చిత్రం మొదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలం చేకూర్చింది. 
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించగా, బాలీవుడ్ నటి ఊశ్వరి రౌతలా ఐటమ్ సాంగ్‌లో నటించారు. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ప్రతినాయకులుగా కనిపించారు. ప్రస్తుతం వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తున్న ఈ సినిమా, లాంగ్ రన్ లో ఎంతవరకూ రాబడుతుందనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments