Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తల్లి మా తల్లి కాదు.. కానీ, కమ్మనైన మనస్సున్న తల్లి అమ్మే కదా.. చిరు

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (15:45 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి... కరోనా కష్టకాలంలో తన వృద్దాప్యాన్ని సైతం లెక్క చేయకుండా మాస్కులు కుడుతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె గత మూడు రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి స్వయంగా దాదాపు 700 పైగా మాస్క్‌లు కుట్టారనీ, వారిని అవసరమున్నవారికి అందజేశారనీ, ఈ కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారంటూ అనేక మీడియాల్లో కూడా కథనాలు వచ్చాయి. ఈ విషయం మెగా ఫ్యామిలీ దృష్టికి వెళ్లింది.
 
దీనిపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కొన్ని ప‌త్రికా సంస్థ‌లు, మీడియా ఛానెల్స్ నా త‌ల్లి మాన‌వ‌తా దృక్ప‌థంతో ప‌ని చేస్తున్న‌ట్టు వార్తు రాశాయి. ఆ వార్తలు నిజం కాదు. ఆ ఫోటోలో క‌నిసిస్తుంది నా త‌ల్లి కాదు. కాక‌పోతే కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా ఉండేందుకు ఓ త‌ల్లి చేస్తున్న ప్ర‌య‌త్నానికి నా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే క‌దా అని చిరంజీవి ఎంతో భావోద్వేగంతో తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments