Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రంగమ్మత్త'గా హాట్ యాంకర్.. నెటిజన్లు 'ఫిదా'

రంగమ్మత్తగా హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ 'జబర్దస్త్' భామ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీనికి కారణం లేకపోలేదు.

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (15:54 IST)
రంగమ్మత్తగా హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ 'జబర్దస్త్' భామ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల ఓ బాలుడు ఈ హాట్ యాంకర్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా, అతని సెల్‌ఫోన్ లాక్కొని పగలగొట్టి, దుర్భాషలాడిన విషయం తెల్సిందే. దీనిపై ఆ పిల్లోడి తల్లి కూడా అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో పెను వివాదాస్పదమైంది.
 
ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కాగా పలువురు నెటిజెన్లు ఆమె వ్యవహారశైలిపై విరుచుకుపడ్డారు. సదరు మహిళ తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ అనసూయ చెప్పినప్పటికీ... నెటిజెన్ల దాడి కొనసాగింది. దీంతో, కొంతకాలం పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నట్టు అనసూయ ప్రకటించింది. ఫిబ్రవరి 6వ తేదీన తన అకౌంట్లను డిజేబుల్ చేసింది.
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా రీఎంట్రీ ఇచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాను ఆదివారం యాక్టివేట్ చేసి, 'రంగస్థలం' ట్రైలర్‌ను అప్‌లోడ్ చేసింది. ట్విట్టర్ అకౌంట్‌ను ఈ రోజు యాక్టివేట్ చేసిన అనసూయ... 'రంగస్థలం'లో తాను పోషించిన రంగమ్మత్త ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి, తమకుతోచిన విధంగా కామెట్స్ పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments