అమలాపాల్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమవుతోందా??

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (18:11 IST)
అమలాపాల్ తాజాగా నటించిన చిత్రం 'ఆడై' సినిమా ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రత్నకుమార్ దర్శకత్వంలో అమలా పాల్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'ఏ' సర్టిఫికేట్‌ను సంపాదించుకుంది.
 
అయితే... ఈ సినిమాకి 'యు' సర్టిఫికేట్ గానీ.. యూ/ఏ సర్టిఫికేట్ గానీ వస్తుందని భావించిన నిర్మాతలు 'ఏ' సర్టిఫికేట్ రావడంతో కాస్త డీలా పడ్డారట. సర్టిఫికేట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను దూరం పెడతారేమోనని నిర్మాతలు టెన్షన్‌ పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
కాగా... ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉందనీ, అందువల్లనే 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారనీ మరి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అమలాపాల్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కాస్త దూరమయ్యే దాఖలాలే కనబడుతున్నాయని ఊహాగానాలు వినపడుతున్నాయి.
 
మరి ఈ ఊహాగానాలు ఏ మేరకు నిజమో తెలియాలంటే త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసుకుని, ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments