Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:53 IST)
చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. కానీ, ఈ చిత్రం విడుదలకు ముందే ఓ వ్యక్తి తిలకించారు. సైరాను తిలకించిన తొలి ప్రేక్షకుడు ఆయనే. ఆయన పేరు అల్లు అరవింద్. ప్రముఖ నిర్మాత. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు కాకుండా ఈ సినిమా చూసిన మొదటి ప్రేక్షకుణ్ణి నేనే. ఇంత భారీ బడ్జెట్‌ సినిమా ఎలా ఉంటుందోనన్న భయంతో చూశా. ఒక్కో సీన్‌ చూసి కింద పడిపోయా. కింద నుంచి లేచి చిరంజీవిని కౌగిలించుకున్నా. అంత అద్భుతంగా సినిమా వచ్చింది అని చెప్పుకొచ్చారు. 
 
ఆ తర్వాత చిత్ర దర్శకుడు ఏ.సురేందర్ రెడ్డి స్పందిస్తూ, 'ఈ సినిమా కోసం 250 రోజులు చిత్రబృందమంతా ఓ కుటుంబంలా చాలా కష్టపడ్డాం. వాళ్లందరికీ, తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చిరంజీవికి, రామ్‌చరణ్‌కి థ్యాంక్స్‌. చరణ్‌ ఎంతో ఫ్రీడమ్‌ ఇచ్చి ముందుకు నడిపించారు అని చెప్పారు. మరో సెన్సేషనల్ డైరెక్టర్ వివి.వినాయక్ మాట్లాడుతూ, 'తెలుగు సినిమా రారాజు, అన్నయ్య చిరంజీవి ఈ సినిమాలో ఉగ్ర నరసింహస్వామిలా ఉన్నారు' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments