Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైరా క్లైమాక్స్ పై ఉత్కంఠ‌. ఇంత‌కీ క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుంది..?

Advertiesment
Sye Raa Narasimha Reddy
, బుధవారం, 18 సెప్టెంబరు 2019 (12:39 IST)
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ సంచ‌ల‌న చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. 
 
అభిమానుల ఎదురు చూపుల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమాలో క్లైమాక్స్  సీన్ ని ఎలా చూపిస్తారు అనేది అందరిలో ప్రధానంగా ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే... సైరా సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు అందరూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు. 
 
అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటంటే.. నరసింహారెడ్డి రెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసి..  మరణించిన అనంతరం తలను కోట గుమ్మానికి వ్రేలాడదీశారు. దేశంలో ఒక్కసారిగా భయాన్ని కలుగజేసిన ఆ విషయాన్నీ తెర పై ఎలా చూపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. 
 
ఎందుకంటే... చిరంజీవి త‌ల‌ను అలా కోట‌కు వేలాడితీసిన‌ట్టు చూపిస్తే... జ‌నం ఒప్పుకుంటారా..?  చిరుని అలా చూడ‌గ‌ల‌రా..? అనేది అంద‌రిలో ఉన్న సందేహం. మ‌రి... చిరు కోసం క్లైమాక్స్ మార్చారా..?  లేక ఎలా జ‌రిగిందో అలాగే తీసారా...? అనేది తెలియాలంటే... అక్టోబర్ 2 వ‌ర‌కు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'ఎల్లువొచ్చి గోదారమ్మ' ప్రోమో సాంగ్