Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా చూసేందుకు డబ్బులివ్వలేదనీ తండ్రిపై పెట్రోల్ పోసి...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (08:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో హీరో అజిత్ వీరాభిమాని ఒకరు అత్యంత దారుణ చర్యకు పాల్పడ్డాడు. తన హీరో చిత్రాన్ని చూసేందుకు డబ్బులు ఇవ్వని కన్నతండ్రిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి హత్య చేసేందుకు యత్నించాడు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
హీరో అజిత్ తాజా చిత్రం "విశ్వాసం" గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని తొలి రోజే చూడటం అతని వీరాభిమాని అయిన వేలూరుకు చెందిన అజిత్ కుమార్ అనే యువకుడు అలవాటు. అలాగే, 'విశ్వాసం' చిత్రాన్ని కూడా చూడాలని భావించాడు. 
 
కానీ, చేతిలో డబ్బులు లేకపోవడంతో తన తండ్రి పాండ్యరాజన్‌ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. ఆయన డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన అజిత్ కుమార్ తండ్రి పాండ్యరాజన్‌పై పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు యత్నించాడు. ఈ ఘటనలో పాండ్యరాజన్ ముఖం కాలిపోవడంతో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అజిత్ కుమార్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments