Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా చూసేందుకు డబ్బులివ్వలేదనీ తండ్రిపై పెట్రోల్ పోసి...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (08:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో హీరో అజిత్ వీరాభిమాని ఒకరు అత్యంత దారుణ చర్యకు పాల్పడ్డాడు. తన హీరో చిత్రాన్ని చూసేందుకు డబ్బులు ఇవ్వని కన్నతండ్రిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి హత్య చేసేందుకు యత్నించాడు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
హీరో అజిత్ తాజా చిత్రం "విశ్వాసం" గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని తొలి రోజే చూడటం అతని వీరాభిమాని అయిన వేలూరుకు చెందిన అజిత్ కుమార్ అనే యువకుడు అలవాటు. అలాగే, 'విశ్వాసం' చిత్రాన్ని కూడా చూడాలని భావించాడు. 
 
కానీ, చేతిలో డబ్బులు లేకపోవడంతో తన తండ్రి పాండ్యరాజన్‌ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. ఆయన డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహించిన అజిత్ కుమార్ తండ్రి పాండ్యరాజన్‌పై పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు యత్నించాడు. ఈ ఘటనలో పాండ్యరాజన్ ముఖం కాలిపోవడంతో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అజిత్ కుమార్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments